ముస్తాబాద్ జ
నవరి 26, ముస్తాబాద్ ఏబీవీపీ శాక ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరం సొత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రగతి పథంలో దూసుకువెళ్తూ భారతదేశం నేడు విశ్వగురువుగా అవతరించడం భారతీయులుగా మనందరకీ గర్వకారణం అని అన్నారు..




