ప్రాంతీయం

విద్యార్థులకు మాకు పోలింగ్ పై అవగాహన

252 Views

రాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మాక్‌ పోలింగ్‌ (నమూనా ఎలక్షన్‌)ను విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు మాక్‌ పోలింగ్‌ను నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు సత్తయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికలకు సంబంధించి విధి విధానాలు నియమాలు నిర్వహణ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ మాక్ పోలింగ్ ద్వారా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో విషయాన్ని కన్నులకు కట్టినట్లుగా విద్యార్థులకు చూపించారు. ఓటు హక్కు పై అవగాహన కల్పించి ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటు విలువను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సి ఆర్ పి స్వామి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

One Reply to “విద్యార్థులకు మాకు పోలింగ్ పై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *