యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలంలోని కాచారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో శుక్రవారం మాస శివరాత్రి పురస్కరించుకొని ఆలయ అర్చక స్వామి వంగపల్లి అంజయ్య స్వామి అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నేరేడ్మెట్ వాసి ప్రముఖ వ్యాపారవేత్త సద్గురు ట్రేడర్స్ సోన్నతి రామ నర్సింలు ఇందిరమ్మ వారి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం బైరి ప్రభాకర్ అలేఖ్య, జోగులాంబ జిల్లా జల్లాపురం వాసి ఆర్యవైశ్య నాయకులు ఇట్యాల సుబయ్య శారదా, నరేష్, నీల వెంకటేష్ గౌడ్ రత్న, శిగ మనోరంజన్ గౌడ్ నిత్య, రఘు రంజన్ గౌడ్ లక్షిత, శిగ జంగమ్మ తదితరులు భక్తులు పాల్గొన్నారు.