గజ్వేల్ లోని వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన మహా గణపతి విగ్రహం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం వేంకటేశ్వర స్వామి దేవాలయం ముందు మండపంలో ఏర్పాటు చేసిన పెద్ద వినాయకుని పక్కన నెలకొల్పే చిన్న వినాయకుని విగ్రహాన్ని పల్లకిలో అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక మండపం వరకు డప్పు చప్పుళ్లతో తీసుకువచ్చారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు పూజల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజ్ఞాలను తొలగించే వినాయకుని ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని వెంకటేశ్వర ఆలయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో కొలువుదీరిన వినాయకుని విగ్రహం అపురూపంగా ఉందని అందరూ భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు ఆనందంగా జరుపుకోవాలని అన్నారు




