ప్రాంతీయం

ఈనెల 18న నిర్వహించబడే కంటి వెలుగు కార్యక్రమానికి ట్రయల్ రన్

151 Views

ఈరోజు తొగుట మండలంలోని ఆరోగ్య కేంద్రంలో ఈనెల 18న ప్రారంభం కానున్న కంటి వెలుగు ప్రోగ్రాం అనగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించబడే కార్యక్రమాన్ని ట్రయల్ రన్ డాక్టర్ రాధా కిషన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి ట్రైలర్లు క్యాంపు మెడికల్ ఆఫీసర్ గారైన డాక్టర్ భార్గవి గారు, మరియు సూపర్వైజర్ స్వామి,ఎ.ఎన్ఎ.మ్ఎ.స్, అనురాధ, సంతోష ఆశలు స్వేచ్ఛ, కవిత,లావణ్య మహేశ్వరి, పుష్పలత, మరియు డి. ఇ. ఓ జ్యోతి స్టాఫ్ అందరూ పాల్గొనడం జరిగింది. మన మండలంలో ఈనెల 18న తోగుట గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మన గ్రామ ప్రజలందరికీ కంటి స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించబడును.
క్యాంప్ నందు అవసరమైన వారికి కంటి అద్దాలు వెంటనే ఇవ్వడం జరుగుతుంది.

No Slide Found In Slider.

Poll not found