ప్రజాపక్షం /
ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో అస్సాం ముఖ్యమంత్రి హేమంత విశ్వ పై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య సోమవారం ఫిర్యాదు చేశారు పార్లమెంటు ఎంపీ రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు బిజెపి నాయకులు వ్యక్తులను వారి సంబంధాలపై ప్రశ్నించడం అవివేకమైన చర్య అని అన్నారు ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపిటిసి కొత్తపల్లి దేవయ్య నాయకులు రాజేందర్ గంట బుచ్చ గౌడ్ మహేందర్ రాములు సంతోష్ గౌడ్ కటికే రవి ఇమామ్ బానోతు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు



