దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989-90 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు బుధవారం పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి మిత్రులను ఇన్నేళ్ల తర్వాత చూడడంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆది వెంకన్న అనారోగ్యంతో బాధపడుతుండగా పరామర్శించి మనోధైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బ అశోక్, కిషన్, శ్రీనివాస్, రాజిరెడ్డి, శివ దయాల్, మధుసూదన్ రెడ్డి, జిల్లా శ్రీనివాస్, అప్సర్, రాజయ్య, కిష్టయ్య, దర్శన్, రమేష్, నర్సింలు, ఎర్రయ్య, సత్యం, శంకర్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు…..




