దౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గం లో బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఇటీవల సఫాయి కార్మికుడు అల్వాల శ్రీనివాస్, మాదారం వెంకటేష్ లు మరణించగా కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కౌకూరి యాదగిరి, బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్, నాయకులు కుమ్మరి నర్సింలు, భూపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, రంజిత్ గౌడ్, నర్సింలు, రవీందర్, అనిల్ రెడ్డి, స్వామి, తదితరులు పాల్గొన్నారు..




