దౌల్తాబాద్ మండలాన్ని వ్యవసాయ జిల్లా అధికారి శివప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. మండలంలోని వ్యవసాయ కార్యాలయం మరియు విత్తన షాపులను సందర్శించి, షాపుల యొక్క రికార్డులు ఎప్పటికప్పుడు రాయాలని, అలాగే చట్ట ప్రకారం నడుచుకావాలని సూచించారు. ప్రతి రైతుకూ తప్పని సరిగా బిల్లు ఇవ్వాలని అలాగే బిల్లు పైన రైతు సాంతకం చేపించలని, సూచించారు. అలాగే యశంగి సీజన్లో అవసరమయ్యే ఎరువులు కూడా సరిపడేవని అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఏఈఓలు కూడా పంట నమోదు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జగదీశ్వర్, ఏడిఏ గజ్వెల్ బాబునాయక్, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.




