దౌల్తాబాద్: మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వడ్ల నర్సింలు బుధవారం గుండెపోటుతో మృతిచెందగా బిఆర్ఎస్ మండల యువజన అధ్యక్షులు నర్ర రాజేందర్ రూ.5 వేలు, భగత్ సింగ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రూ.10 వేలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సింలు కుటుంబానికి అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షఫీ, చంద్రయ్య, యాదగిరి, రవి, సాయిలు, కృష్ణ, కనకరాజు, నాగరాజు, పాండు, ఖాజా, మల్లేశం, చందు, కరుణాకర్, సురేష్, స్వామి, భాను, శ్రీనివాస్, ఆటో డ్రైవర్లు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు…




