ముస్తాబాద్ డిసెంబర్ 21, బీఆర్ఎస్ మండల నాయకులు పలు గ్రామాలలో ఇంటింటి సెస్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో సందుపట్ల అంజిరెడ్డికి ఓట్లు వేయాలని
నిర్వహించారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ నాయకులు బకెట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రైతుల ఓటర్లను కోరారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తరువాత చేపడుతున్న సంక్షేమ పథకాలు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి షాదీముబారక్, వితంతు పింఛన్, ఆసరా పింఛన్, కార్యక్రమాలు చేపడుతున్న ఏకైక ప్రభుత్వమని అన్నారు. ఈకార్యక్రమంలొ ఎంపీపీ, టిఆర్ఎస్ నాయకులు, మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




