
కేటీఆర్ పంపిన క్రికెట్ కిట్ యువతకు అందించిన మాజీ ఎంపీటీసీ
TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన యువత మొన్నటి వరకు నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ పోటీల్లో పాల్గొనడంతో,క్రికెట్ కప్ పోటీల్లో పాల్గొన్న టీంలన్నిటికీ క్రికెట్ కిట్లను కేటీఆర్ పంపించడంతో అట్టి క్రికెట్ కిట్లను గురువారం గ్రామ యువతకు మాజీ ఎంపీటీసీ నమలికొండ శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నమిలికొండ నరసింహులు, కళ్యాణ్ నాయక్,ప్రభు నాయక్, గోగురి చంద్రం,మారుపాక దేవయ్య,శంకర్, ఎల్లయ్య, పెద్దమ్మల దేవయ్య,శరత్ బాబు,స్కైలాబ్, సత్యపాల్,శ్రీశైలం, శ్రీనివాస్ గౌడ్,చంద్రయ్య,లింగరెడ్డి, క్రీడాకారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





