
వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఎప్పుడు
కొనుగోలు కేంద్రాల వద్దకు చేరిన ధాన్యం
అకాల వర్షాలు పడితే రైతులు నష్టపోతారు: సర్పంచ్ కొండ రమేష్ గౌడ్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు గత 15 రోజుల నుండి తరలిస్తున్నారని,అకాల వర్షాలు కురిసి రైతులు నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని, అలాగే ఎండ తీవ్రతలు పెరిగినందున రైతులు వడదెబ్బ తగిలి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నందున వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మండల వ్యాప్తంగా ఇప్పటివరకు ఎక్కడ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని ఇట్టి విషయాన్ని గమనించి జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ అధికారులను మీడియా ముఖంగా కోరారు.





