
మొరాయించిన ప్రొజెక్టర్
-ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో టెక్నికల్ ప్రాబ్లం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు ప్రజలకు ఆయా శాఖల అధికారులు ప్రొజెక్టర్ ద్వారా వీడియో మానిటరింగ్ చేస్తూ సంక్షేమ పథకాల అమలు విషయాలను ప్రజలకు చేరవేసే సందర్భంలో టెక్నికల్ ప్రాబ్లంతో ప్రొజెక్టర్ మొరాయించడంతో వీడియో మానిటరింగ్ లేకుండానే కార్యక్రమం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇట్టి కార్యక్రమంలో టెక్నికల్ ఇష్యూ పేరుతో ప్రజలకు అవగాహన కలిగించే వీడియో మానిటరింగ్ చేయించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ముచ్చటించారు.





