
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం నిర్వహణ
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు, మండలంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు ఆయా శాఖల అధికారులు చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య,మండల స్పెషల్ ఆఫీసర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, తహసిల్దార్ సుజాత,ఎస్సై రాహుల్ రెడ్డి,ఏఓ రాజశేఖర్, ఎంఈఓ కృష్ణహరి,వివిధ శాఖల అధికారులు ఏఏంసీ చైర్ పర్సన్ షేక్ సాభేరా బేగం,వైస్ చైర్మెన్ గుండాడి రాంరెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు,ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యులు,పాల్గొన్నారు.





