ప్రాంతీయం

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు పీజు రియంబర్స్మెంట్…

116 Views

పెండింగ్ స్కాలర్షిప్ ఫీజురియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్  కంచర్ల రవిగౌడ్ బిసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…ముస్తాబాద్/అక్టోబర్/31 బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందులో ప్రకాష్  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ హాజరై విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థిని విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు మరియు ఫిజియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు 3000 కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్నాయని అన్నారు విడుదల చేయని కారణంగా ఎంతోమంది పేద విద్యార్థులు చదువు మధ్యలో ఆపడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిని విద్యార్థులకు కీలకపాత్ర అనే విద్యార్థిని విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నామని గుర్తు చేశారు కానీ విద్యార్థిని విద్యార్థులను పట్టించుకోవడంలేదని అన్నారు స్వరాష్ట్రంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయలేదని అన్నారు అలాగే రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్లలో బీసీ హాస్టల్ కి పక్కా భవనాలు లేవని అన్నారు పక్కా భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే బీసీ హాస్టల్లో పక్కాభవనాలని మంజూరు చేయాలని కోరారు అలాగే హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు రేపటి నుండే ప్రతి మండల కేంద్రంలో ఫీజు యాత్రతో విద్యార్థిని విద్యార్థులతో కలిసి మండల ఆఫీసులను ముట్టడిస్తామని అన్నారు వారం పది రోజులలో ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్, మండల అధ్యక్షులు మట్ట నరేష్ ,బీసీ హాస్టల్ అధ్యక్షులు నవీన్ ,నాయకులు, పోతర్ల వంశీ, పోతర్ల గణేష్, అల్లే నీరజ్, దొరగాండ్ల వినీత్ ,దుబ్బాక అజయ్ ,బత్తిని రోహిత్, అడగొప్పుల జగన్ ,విజయ్, సిద్ధార్థ ,మనోజ్, కార్తీక్, లక్ష్మణ్, రాజకుమార్ ,విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్