మంచిర్యాల జిల్లా.
4797 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు.
మంచిర్యాల జిల్లాలో గత రెండు నెలల్లో 4797 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లుగా మంచిర్యాల జిల్లా అదన కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రజలు ఎలాంటి ఆందోళనలు చెందవద్దని అదనపు కలెక్టర్ ప్రజలకు సూచించారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులలో సభ్యులను చేర్చడానికి ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన సభ్యులందరి పేర్లను రేషన్ కార్డులో ఎక్కించి వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు.





