
ఓమిని వ్యాన్ లో తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఓమిని వ్యాన్ లో ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఏడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తూ రాచర్ల గొల్లపల్లి ప్రాంతంలో పట్టుబడ్డాడనీ పోలీసులు తెలిపారు. రేషన్ బియ్యం తో పాటు ఓమిని వ్యాన్ ను సీజ్ చేసినట్లు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాహుల్ రెడ్డి హెచ్చరించారు.





