
ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ఫిష్ మార్కెట్
-రోడ్డు మధ్యలో వాహనాలు నిలుపుతున్న ఫిష్ కొనుగోలుదారులు
– ఫిష్ మార్కెట్ ను బైపాస్ రోడ్డుకు తరలించాలని లేదా వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ప్రతి శనివారం నిర్వహించే వారసంతలో భాగంగా ఫిష్ మార్కెట్ ను సిరిసిల్ల – కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన నిర్వహిస్తుండడం తో కొనుగోలుదారులతో, కొనుగోలుదారులు రోడ్డు మధ్యలో నిలుపుతున్న వాహనాలతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది.అంతేకాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం పొంచి ఉన్నందున ప్రమాద నివారణకై ముందస్తు చర్యలు చేపట్టాలని ఫిష్ మార్కెట్ ను బైపాస్ రోడ్డుకు తరలించాలని లేదా వాహనాలు రోడ్డు మధ్యలో నిలపకుండా చర్యలు చేపట్టి పార్కింగ్ సౌకర్యం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.





