
పోలీసు వారి హెచ్చరిక: ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి మండలాల శివారులో కంచర్ల-వీర్నపల్లి మధ్యలో చిరుతపులి సంచరిస్తున్నందున వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల ప్రజలు పులి సంచరిస్తున్న ప్రాంతంలోని చుట్టుప్రక్కల గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని,ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని అంతేకాకుండా రాత్రి వేళల్లో పొలాల వద్ద నిద్రించడం,ఒంటరిగా అటవీ మార్గాల్లో ప్రయాణించడం ప్రమాదకరం అని,పశువులను అటవీ ప్రాంతంలో కట్టేయ వద్దని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి ప్రజలకు తెలుపుతూ అప్రమత్తం చేసినారు.





