
సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ – శ్రీ విద్యా దంపతులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ – శ్రీ విద్యా దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.వేకువ జామున స్వామివారి ఆలయానికి సతీ సమేతంగా చేరుకున్న సంగీతం శ్రీనివాస్ ఆలయంలో నిర్వహిస్తున్న స్వామివారి కళ్యాణ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా అర్చకులు సంగీతం శ్రీనివాస్ దంపతులకు వేదోక్త ఆశీర్వచనం అందించారు.





