ప్రాంతీయం

సేవా ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఐ దామోదర్.

119 Views

సేవా ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఐ దామోదర్.

కీర్తి శేషులు తాండా మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం చలివేంద్రం పప్రారంభం

మర్కుక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం సామాజిక కార్యకర్త, సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాండ బాలకృష్ణ గౌడ్, ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎస్ ఐ దామోదర్, ఫ్లాష్ ఫ్రేమ్ బృందం తో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రజల దాహార్తి తీర్చడంలో చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని, తాండ బాలకృష్ణ గౌడ్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, అలాగే వారు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమం 25 వ కార్యక్రమం కాబట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అని అన్నారు, అనంతరం సేవా ఫౌండేషన్ చైర్మన్ తాండ బాలకృష్ణ గౌడ్, మాట్లాడుతూ, వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తి తీర్చడానికి, మా తండ్రి కీర్తిశేషులు తాండ మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని, చలివేంద్రం ప్రారంభించడానికి వచ్చిన ఎస్ఐ దామోదర్ కు పోలీస్ బృందానికి ఫ్లాష్ ఫ్రేమ్ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు,

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *