
సకాలంలో పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి: ఎంఈఓ కృష్ణహరి
మార్చ్ 29న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్ష
తెలంగాణ రాష్ట్రంలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలలో 2026 – 2027 విద్యా సంవత్సరంలో ఆరవ తరగతిలో ప్రవేశమునకు ఎంట్రెన్స్ పరీక్ష ఈ నెల మార్చి 29 ఆదివారం రోజున ఈఎంఆర్ఎస్ దుమాలలో జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలియజేశారని ఎంఈఓ తెలిపారు.కావున ఆరవ తరగతిలో ప్రవేశమునకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tsemrs.telangana.govt.in వెబ్సైట్ నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేశారు.పరీక్షా సమయము ఉదయము 10:30 నుండి 12:30 వరకు జరుగునని, అభ్యర్థులను 9:30 నిమిషాలకు పరీక్ష హాల్లోకి అనుమతించ బడునని దుమాల సెంటర్ కు చెందిన అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలని ఎంఈఓ గాలిపెల్లి కృష్ణహరి సూచించారు.పరీక్ష రాయబోతున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు.





