
గొల్లపల్లి లో వేణుగోపాల స్వామి కళ్యాణ వేడుకలో పాల్గొని,స్వామి వారిని దర్శించుకున్న డీఎస్పీ నాగేంద్రచారి.
ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను తిలకించుటకు రాజన్న సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆలయానికి విచ్చేశారు.స్వామి వారి దర్శనం అనంతరం అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.పుర ప్రముఖులు, సన్నిహితులు,సర్పంచ్,కార్యక్రమ నిర్వాహకులు డీఎస్పీనీ శాలువాతో ఘనంగా సత్కరించారు.





