*డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి 5 రోజులు జైలు శిక్ష*
రామగుండం పోలీస్ కమిషనరేట్.
మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి జైలు శిక్ష విధించినట్లు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. వన్ టౌన్ పోలీసులు ఇటీవల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 11 మందిని బుధవారం స్థానిక కోర్టు లో హాజరుపరిచారు. విచారణ జరిపిన కోర్టు మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష, 2,500 వేల జరిమానా విధించారన్నారు. మిగతా 10 మందికి రూ.20వేల జరిమానా విధించినట్లు వివరించారు.





