
ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్సై రాహుల్ రెడ్డి
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్ ఆవరణలో ఎస్సై రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటోవాలాలకు అవగాహన సదస్సు నిర్వహించారు, అవగాహన సదస్సులో భాగంగా ఆటో డ్రైవర్లు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని,ఆటోలు ఓవర్ టేక్ చేయకుండా ఓవర్ లోడు ప్యాసింజర్లను ఎక్కించుకోకుండా ఆటోలు నడపాలని,మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై రాహుల్ రెడ్డి హెచ్చరించారు.ఇట్టి కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు,తదితరులు పాల్గొన్నారు





