ప్రకటనలు

జాతీయ మెగా లోక్ అదాలత్ లో రాజీతో కేసులు పరిష్కరించుకోండి: జిల్లా ఎస్పీ మహేష్ కుమార్ బి. గీతే

14 Views

జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా రాజీతో కేసులను పరిష్కరించుకోండి:జిల్లా ఎస్పీ.

ఈనెల 28వ తేదీ శనివారం రోజున నిర్వహించబడనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోని రాజీ పడదగిన కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు.ఈలోక్ అదాలత్‌లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,సివిల్ వివాదాలు,ఆస్తి విభజన కేసులు,కుటుంబ పరమైన నిర్వహణ కేసులు, వైవాహిక వివాదాలు,బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు,చెక్ బౌన్స్ కేసులు,డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు,చిన్నచిన్న పెట్టి కేసులు,ఇతర రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.జుడీషియల్ శాఖ అందించిన ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇరుపక్షాలు శాంతియుత పరిష్కారం పొందాలని సూచించారు. జిల్లా పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్‌లు మరియు ఇతర సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి,ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ కుదిరేలా అవగాహన కల్పిస్తారని తెలిపారు.కాబట్టి తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని భావించే వారు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
పందిర్ల రవికాంత్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర క్రైమ్ ఇంచార్జ్ 9848938940

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *