
ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సిద్దోగం వేడుకలకు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మంగళవారం హాజరయ్యారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం వారు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ కృప వలన ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.వారితోపాటు మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి ఉన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు చిరుగు గోవర్ధన్ గౌడ్ తో పాటు బొప్పాపూర్ గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు.





