మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయటం సరికాదు
బిఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి
తెలుగు న్యూస్ 24/7
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు జారీ సరికాదని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం తగదని భారత రాష్ట్ర సమితి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల అధ్యక్షుల పాకాల మహిపాల్ రెడ్డి తెలిపారు.ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమం చేసిన నాయకుడిపై చర్యలు తగవని,తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి , ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ అని, కాళేశ్వర జలాలతో లక్షల ఎకరాల భూమిని సస్యశ్యామలం చేసినందుకు, రైతు బంధు, రైతు బీమా ఇచ్చిన నాయకునిపై ,వ్యవసాయాన్ని పండగల మార్చిన కేసీఆర్ పై సిట్ నోటీసులు తగవని, కాంగ్రెస్ ప్రభుత్వ దుర్వినియోగానికి పరాకాష్ట అని కేసీఆర్ గారిని టచ్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్లే అని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ ది అని గుర్తుచేశారు.





