మంచిర్యాలలో గద్దెపైకి సమ్మక్క ఆగమనం
ఆధ్యాంతం భక్తుల కోలాహలం.
వన దేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సురేఖ దంపతులు.
మంచిర్యాల జిల్లా
కన్నుల పండుగగా సమ్మక్క తల్లిని ఊరేగింపుగా గౌతమేశ్వర ఆలయ ప్రాంగణం కు తీసుకొచ్చారు. సమ్మక్క రాక సందర్భంగా అధిక సంఖ్యలో భక్తుల పూనకాలు భక్తిమయంతో నినాదాలు చేశారు.
అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించి. గోదావరి ప్రాంతంలో జాతరను జరుపుకున్నారు.
వన దేవతలు సమ్మక్క సారలమ్మలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సురేఖ దంపతులు దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకొని భక్తులకు కొంగుబంగారమైన తల్లుల దీవెనలు భక్తులకు ఉండాలని అన్నారు. మంచిర్యాల మరింతగా అభివృద్ధి చెంది ప్రజలు సుభిక్షంగా ఉండాలని అన్నారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సిబ్బందిని అభినందించారు. మరింతగా ఈ ప్రాంతం వృద్ధిలోకి రావాలని కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.





