సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ లో మృతుల కుటుంబాలను బుదవారం నాడు పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి డెలిగేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి సిద్దిపేట పట్టణంలోని 26వ వార్డులో గత 15 సంవత్సరాల నుండి నివసిస్తున్న శీల సాగరం రమేష్ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ సర్వే లో నాలుగు సార్లు ఎంపికై ఫైనల్ లిస్టులో పేరు లేకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి శీలా సాగరం రమేష్ మంగళవారం రోజున ఆత్మహత్య చేసుకున్నాడు, శీల సాగరం రమేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు మృతుని కుటుంబానికి మనోధైర్యం కల్పించారు మృతి చెందిన రమేష్ కి భార్య లలిత, సిద్దు అశ్విన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేయాలని డిమాండ్ చేశారు అలాగే గుండెపోటుతో మంగళవారం రోజున వేములవాడ రాజు మృతి చెందాడు మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు మృతుడు రాజు కు భార్య లావణ్య, ఈశ్వర్ ,విష్ణు ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించి ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ కొండపాక విజయ్,
నర్సంపల్లి నాగరాజు,
మంద నర్సింలు, ఆందోల్ నర్సింలు, చంద్రారెడ్డి, రాజిరెడ్డి, తలారి సత్తయ్య, చాకలి సామి, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.