126 Views
ముస్తాబాద్ డిసెంబర్ 7, ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ బరిలో నిలుస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు దీటి నర్సింలు బరిలో నిలుస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు, అవకాశం కల్పిస్తే పోటీచేస్తానని తెలిపారు. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ రైతులకు, గ్రామస్తులకు సంబంధించిన విద్యుత్ సమస్యలపై, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరంతరం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, విద్యుత్ సమస్యలున్న గ్రామాలలో అవసరమున్నచోట సబ్ స్టేషన్ లు నిర్మిస్తానని తెలిపారు, విద్యుత్ వినియోగదారులందరు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నో ప్రజల సమస్యల పై స్పందిస్తూ నిరుపేద ప్రజలను ఆదుకుంటున్న దీటి నర్సింలును గెలిపించాలని మండల ప్రజలు కూడా కోరుకుంటున్నారని దీటి నర్సింలు తెలిపాడు.
