ప్రాంతీయం

నేలను సంరక్షించి భూసారాన్ని పెంచుకోవాలి

122 Views

దౌల్తాబాద్: నేలను సంరక్షించి భూసారాన్ని పెంచుకోవాలని మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు అన్నారు. సోమవారం మండల పరిధిలోని దొమ్మాట రైతు వేదికలో ప్రపంచ నేల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తథానుగుణంగా ఎరువులు వాడాలని సూచించారు. నేల ప్రాముఖ్యత, నేల ఆరోగ్యం, నేలను సంరక్షించే పద్ధతులు, అంతర పంటలు, పచ్చిరొట్ట ఎరువులు ఆవశ్యకత, పంటల మార్పిడి వల్ల నేల ఆరోగ్యం పెంచే విధానంపై రైతులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మాట, ముత్యంపేట సర్పంచులు పూజిత వెంకటరెడ్డి, బండి రాజు, మండల కో ఆప్షన్ అహ్మద్, ఏఈఓ సంతోష్ కుమార్, గ్రామ రైతు సమితి కోఆర్డినేటర్లు నర్ర రాజేందర్, చంద్రారెడ్డి, లింగం, రైతులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7