ముస్తాబాద్, జూన్ 7 రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను హైదరాబాదులో ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గజ్జల రాజు మాట్లాడుతూ బిసి సంక్షేమ శాఖ మంత్రిని ఆయన చాంబర్ లో కలిసి మండలంలో పలు సమస్యల గురించి వివరించి ప్రజా పాలన దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ గ్రామంలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మంత్రికి వివరించామన్నారు.




