136 Views
-
మండల పరిధిలోని కొనాయిపల్లి విద్యార్థిని స్రవంతి హార్టి సెట్ 2022లో బీఎస్సీ హార్టికల్చర్ విభాగంలో రాష్ట్రంలో మూడవ ర్యాంకు సాధించింది. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో పై చదువుల కోసం దాతల కోసం ఎదురు చూస్తుంది. వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని కొనాయిపల్లికి చెందిన స్వామి కూలి పని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. స్వామికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురు కళ్యాణి ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలో నిలిపివేసి ప్రస్తుతం కుట్టుమిషన్ నిర్వహిస్తూ కుటుంబానికి చేదోడు వాదుడుగా నిలుస్తుంది. మరో కూతురైన స్రవంతి మొదటి నుండి చదువులో చాలా చురుగ్గా ఉండేది. ఆదిలాబాద్ లో ఆర్టికల్చర్ డిప్లొమా కోర్సు పూర్తి చేసింది. స్రవంతి హార్టికల్చర్ బీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాల్లో తెలంగాణ స్టేట్ మూడవ ర్యాంకు సాధించింది. బీఎస్సీ హార్టికల్చర్ చదవాలంటే నాలుగు సంవత్సరాల గాను 5 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 5వ తేదీన జరిగే కౌన్సిలింగ్లో మొదట విడత 50,000 చెల్లిస్తేనే సీటు కన్ఫామ్ అవుతుంది. నిరుపేద కుటుంబం కావడం వలన ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చదువుకు దూరం కావలసిన పరిస్థితి ఉందని పై చదువుల కోసం సహయం అందించాలని స్రవంతి, ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. స్రవంతి పదవ తరగతి దౌల్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 10/10 సాధించింది. అనంతరం అదిలాబాద్ ప్రభుత్వ హార్టికల్చర్ డిప్లమా సీట్ రావడంతో అక్కడ చదువు పూర్తి చేసి ప్రస్తుతం బీఎస్సీ హార్టికల్చర్ రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించింది. పేదరికం అడ్డువస్తున్న ఈ చదువుల తలికి సాయం అందించాలని తలిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్నారు.
No Slide Found In Slider.
Poll not found