ముస్తాబాద్, మే 24 మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని అడ్డంకులు ఉన్న అధిరోహించి సీఎంఆర్ఎఫ్ నిధులను పేద మధ్యతరగతి వాళ్లకు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. మండలానికి సుమారు 22చెక్కులు మంజూరు కాగా 9 లక్షల25 వేల రూపాయల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పేదలు లబ్ధి పొందారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, మాజీ ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, బీసిసెల్ మండల అధ్యక్షులు శీల ప్రశాంత్, గూడెం తదితర గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, బాబు, దొనుకుల కొండయ్య, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, యాగండ్ల మల్లేశం, షాదుల్ పాప, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
