మంచిర్యాల జిల్లా.
ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉన్న లైబ్రరీ దగ్గర విద్యార్థినీ విద్యార్థులతోనే కలిసి గ్రంథాలయ సమస్యల పైన మరియు అదిలాబాద్ కరీంనగర్ నిజాంబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రసన్న హరికృష్ణ మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాల్సిందిగా అశోక అకాడమిక్ చైర్మన్, నిరుద్యోగ హక్కుల రాష్ట్ర చైర్మన్అయినా అశోక్ గ్రాడియేషన్ పూర్తి చేసిన విద్యార్థులను కోరడం జరిగింది.
ఈ సమావేశంలో బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్, బీసీ JAC నాయకుడు గజ్జెల్లి వెంకటయ్య, అడ్వకేట్ నటేశ్వర్, జాతీయ బీసీ సంఘం జిల్లా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండేల్ల శ్రీనివాస్, బీసీ జేఏసీ యువజన నాయకుడు పెద్దల చంద్రకాంత్, ఎండి లతీఫ్, సయ్యద్ సాకీర్ తదితరులు పాల్గొన్నారు.
