ముస్తాబాద్, ఏప్రిల్ 14 బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్134వ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో అత్యంత శోభానంగా గద్దెను పూలతో అలంకరించి అంబేద్కర్ విగ్రహాలకు ముందుగా గజమాల, పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి సురేష్ తో పాటు తదితర పార్టీలు నాయకులు, పార్టీలకు అతీతంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి అంబేద్కర్ సంఘాల నాయకులు, పలువురు ముఖ్య అతిథులు మాట్లాడుతూ మన భారత రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పి స్వతంత్య్ర భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, దేశంలోనే ప్రముఖ న్యాయనిపుణుడిగా ఆర్థికవేత్తగా సంఘ సంస్కర్తగా అంబేడ్కర్ ఎంతో ప్రసిద్ధిగాంచారని గుర్తుచేశారు. అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి అని పేద బడుగు బలహీనులకు రాజ్యాంగ పరంగా అనేకచట్టాలు తెచ్చి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. సామాజిక న్యాయం కోసం జరిగే సమరశీల పోరాటాలపై చెరగని ముద్రవేసిన మహానీయుని బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలు నేటి యువతకు ఆదర్శమని తెలియచేసారు. ఈ కార్యక్రమంలోతదితర మాజీలు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, దళిత నాయకులు, అంబెడ్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
23 Viewsమంచిర్యాల జిల్లా హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం బంద్. జమ్ము కాశ్మీర్లో హిందువులపై పాకిస్తాన్ ముస్లింల దాడు లను నిరసిస్తూ మంచిర్యాల పట్టణ శనివారం 3/5/2025రోజున బంద్ మరియు ర్యాలీ నీ విజయవంతం చేయాలిఅని కోరటం జరిగింది. పాల్గొన్నవారు : ఆర్ఎస్ఎస్ నగర కార్యవహా పార్వతలనర్సయ్య, సహా కార్యవహా బాపూజీ,హిందూ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డేగ రవీందర్, కార్యదర్శి కర్ణకంటి రవీందర్, బంద్ కు మద్దతుగా ఛాంబర్ అఫ్ కామర్స్, తపస్సు […]
104 Viewsతొగుట:వరిధాన్యం కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి కోరారు..మండలంలోని తొగుట, రాంపూర్ గ్రామాల్లో ఐకేపీ, సొసైటీ ఆధ్వర్యంలో వరిధాన్యం కేంద్రాలను సొసైటీ చైర్మన్ కన్నయ్యగారి హరికృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య లతో కలిసి ప్రారంభించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందని ఆమె.పేర్కొన్నారు.. సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య లు మాట్లాడుతూ మండలంలోని […]
126 Viewsముస్తాబాద్ ప్రతినిధి, డిసెంబర్ 29, తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పోలీస్ ఉద్యోగార్తులకు ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈవెంట్ లో అర్హత సాదించిన ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు […]