ముస్తాబాద్, మార్చి 6 (24/7న్యూస్ ప్రతినిధి): విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం ఎస్సైచిందం గణేష్ వారి సిబ్బందితో రాంలక్ష్మణ్ పల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేయగా పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను పట్టుకుని వారి నుండి రూ.13340, ఒక కారు, నాలుగు బైక్లు, ఒక ఆటోను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసామని ముస్తాబాద్ ఎస్ఐ చిందం గణేష్ తెలిపారు.
