ముస్తాబాద్, జనవరి 13 (24/7 న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మండలానికి చెందిన న్యాయవాది సార్గు రాకేష్,తోపాటు దీపకనే వ్యక్తులపై న్యూసెన్స్ కేసు నమోదైనట్లు ఎస్సై చిందం గణేష్ తెలిపారు. ముస్తాబాద్ మద్దికుంట రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనం చేస్తుండగా ముస్తాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు దీపక్, సార్గు రాకేష్ ఇరువురు మద్యం సేవించినారని వారి వాహనాన్ని మోటర్ పై వస్తుండగా పోలీసులు బ్రీత్ అనలైసర్ టెస్ట్ చేశారు. ఏఎస్సై రమణ, పోలీస్ సిబ్బందిపై సభ్యత సంస్కారం లేకుండా నేను నేనొక అడ్వకేట్నని డ్రంక్ అండ్ డ్రైవ్ సహకరించకుండా ద్విచక్ర వాహనానికి నంబర్ ప్లేట్ కూడా లేకపోగా దుర్భాషలాడగా వారిద్దరిపై డ్రంక్ అండ్ డ్రైవ్లో న్యూసెన్స్ చేసి ముస్తాబాద్ సార్గు రాకేష్ న్యాయవాది, తన మిత్రుడు దీపక్పై కేసు నమోదు చేశామని ఎస్సై. గణేష్ తెలిపారు.




