రాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామ సర్పంచ్ పర్వేజ్, ఉపసర్పంచ్ బంధారం సంతోష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భాగరెడ్డి, వార్డు సభ్యులు పడిగే రవీందర్, దయ్యాల పోచయ్య, గ్రామ కో-ఆప్షన్ సభ్యులు పెద్ద ఎల్లయ్య, మన్నే చిరంజీవి, పడిగే మల్లేశం తదితరులు రాయపోల్ మండల తహసీల్దార్ కృష్ణ మోహన్, ఎంపీడీవో శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంతూర్ గ్రామంలో నెలకొన్న పరిశుభ్రత, డ్రైనేజీ సమస్యలు, ఎన్ఆర్ఈజీఎస్ పనుల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించి, అధికారుల నుండి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. గ్రామ అభివృద్ధికి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మార్వో కృష్ణ మోహన్, ఎంపీడీఓ శ్రీనివాస్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు.





