ముస్తాబాద్, జనవరి 11 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో సిద్దిపేట్ రోడ్ మార్గంలో బండి శ్రీకాంత్ బ్రదర్స్ నూతనంగా ఏర్పాటుచేసిన పెట్రోల్ బంకును శనివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే, రాష్ట్ర నాయకులు కణమేని, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. నాణ్యమైన పెట్రోల్, డీజిల్ను వినియోగదారులకు అందించాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ అనుబంధాల నాయకులు కార్యకర్తలు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 




