ముస్తాబాద్ నవంబర్ 30 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతుగల్ గ్రామంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం చేశారు. అందులో భాగంగా భారతి ఫౌండేషన్ వారి సహకారంతో ప్రముఖ కౌన్సిలర్ ఇజాజ్ అహమ్మద్ చే తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనదని విద్యార్థులకు చేతి వ్రాత అందంగా ఎలా రాయాలో నేర్పించడంలో కౌన్సిలర్ మాట్లాడుతూ పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలని, సమయానికి పాఠశాలకు పంపాలని, పిల్లలను అతి గారాబం చేయకూడదని గురుభక్తి, పెద్దల పట్ల గౌరవం, దేశభక్తి పెంపొందించుకోవాలని అలాగే సూర్యోదయం కంటే ముందే పిల్లలను లేపాలని, పిల్లల ముందు తల్లిదండ్రులు కలహించుకోకూడదని వివరించడం జరిగింది. చక్కటి పద్యాలతో, చిన్నచిన్న కథలతో మంచి వాక్చాతుర్యంతో వివరించడం జరిగిందని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సురభి రాధా కిషన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఎదగాలంటే తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం అని, మీ సహకారం మాకు ఎల్లవేళల అవసరమని కోరడం జరిగింది.
పోతుగల్ గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు మాట్లాడుతూ పిల్లలు బాగా చదివి గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు. వార్డ్ మెంబర్ రాజు మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. ఇట్టి సమావేశంలో ఎంపిటిసి కొండని బాలకిషన్, ఎస్ఎంసి వైస్ చైర్మన్ అనిత శ్రీనివాస్, వార్డెన్ కరుణాకర్, భారతి ఫౌండేషన్ ప్రతినిధి శ్రీదీక్ష, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, ఉపాధ్యాయ బృందం,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
131 Viewsపోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారంలో భాగంగా గ్రామాల్లో అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ వీర్నపల్లి మండలం ఎర్రగడ్డతాండ, లాల్ సింగ్ తాండ, గర్జనపల్లి, కోనరావుపేట మండలం మర్రిమడ్ల, నిమ్మపల్లి గ్రామాల్లో పర్యటించి పోడు భూముల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. గ్రామాల్లో దరఖాస్తులు తీసుకుంటున్నది, ఏ ఏ డాక్యుమెంట్లు జతచేస్తున్నది, రశీదులు ఇస్తున్నది, లేనిది, రికార్డుల నిర్వహణ చేస్తున్నది అదనపు కలెక్టర్ […]
67 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 27 (24/7న్యూస్ ప్రతినిధి) బిఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ముస్తాబాద్ చేరుకొని రోడ్డు ప్రమాదంలో గురైన మృతి చెందిన అబ్రమేని సాయిలు పార్థివ దేహానికి పూలమాలవేసి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ముస్తాబాద్ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు, బిజెపి సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెవుల మల్లేశం యాదవ్ లు […]
114 Viewsపాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు బతుకమ్మ మంచి బతుకునివ్వు సిద్దిపేట జిల్లా అక్టోబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ ఆడ పడుచులు అందరు కలసి..సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించారు.. అలా గే ములుగు రేణుక. ములుగు భాగ్యలక్ష్మి. మొద్దు యశోద. ములుగు అనన్య. ములుగు వైష్ణవి. మొద్దు లీనా.మొద్దు అక్షర. మాట్లాడుతూ..మా వూరి ప్రజలను ఆయురారోగ్యాలతో […]