ముస్తాబాద్, డిసెంబర్ 25 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని గూడెం గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా పేద క్రైస్తవులకు బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కణమేని చక్రధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి తన సొంత నిధులతో కానుకలుగా దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం దుస్తులు స్వీకరించిన క్రైస్తవులు సంతోషం వ్యక్తంచేసి రాష్ట్ర నాయకులు చక్రధర్ రెడ్డి కి స్వీట్లు తినిపించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, చర్చి పాస్టర్, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.




