కర్కపట్లలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం &వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ కర్కపట్ల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రములో విప్లవాత్మక మార్పును తెస్తుందనికంటివెలుగు ద్వారా ఎందరికో వెలుగులు పంచుతుందనీ మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు( ఎంపీపీ ) పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డిలు అన్నారు.గురువారం మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రెండో విడత కంటివెలుగు శిబిరాన్ని స్థానిక సర్పంచ్ గాజే నర్సింలు వార్డు సభ్యులు బాలకృష్ణ మధు గౌడ్ బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గ్రామ బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు నవీన్ గ్రామ పెద్దలు నాగులు నర్సిములు పంచాయతీ కార్యదర్శి రేఖ వైద్య సిబ్బందితో కలిసి కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటివెలుగు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ ఆరోగ్యమంత్రివర్యులు హరీష్ రావ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు





