ప్రాంతీయం

ముస్తాబాద్ జర్నలిస్టును అభినందించిన ఎస్సైగణేష్…

168 Views

ముస్తాబాద్, అక్టోబర్ 26 (24/7న్యూస్ ప్రతినిధి): పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లాలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రక్తదానం చేయగా వారితో పాటు పలువురు జిల్లా పోలీస్ లు కోవలో నడిచారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ ఎస్సై గణేష్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు దేశం, రాష్ట్ర ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. అనంతరం పోలీస్ సిబ్బందితోపాటు రక్తందానం చేసిన జర్నలిస్టు వెంకటరెడ్డిని అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7