ముస్తాబాద్, సెప్టెంబర్ 3 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మండల పరిధిలోని మద్దికుంట, మోయిన్కుంట ప్రాథమిక పాఠశాలలో పోక్సో అవగాహన కార్యక్రమం ఎస్సై సిహెచ్. గణేష్ నిర్వహించారు. పరివర్తనాత్మక బాలల హక్కుల అభ్యాసం మరియు పిల్లలకు అవగాహన కల్పించడం వల్ల ప్రపంచం సురక్షితమైన ప్రదేశంగా ఉండాలన్నారు. అందువల్ల, పిల్లల సంబంధిత హక్కులు మరియు చట్టాలపై ఇన్పుట్లు మరియు శిక్షణలను నేర్చుకోవడానికి మరియు స్వీకరించడానికి అవకాశాలు పిల్లల హక్కుల అభ్యాసంలో ప్రధాన అంశం అన్నారు. చిన్న వయసులోనే చెడు అలవాట్లకు దూరం ఉండాలని పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితోపాటు ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
