ముస్తాబాద్, ఆగస్టు19 (24/7న్యూస్ ప్రతినిధి):
మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు తడక బాలకిషన్ ఆధ్వర్యంలో జంధ్యాల పౌర్ణమి పర్వదినం వేడుకలు నేత్ర పర్వంగా నిర్వహించారు. శాస్త్ర పద్ధతిగా వేద పండితులు హోమము పూర్ణావతి విశేష పూజలు, గాయత్రి ధారణ చేయించారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాద అందజేశారు. సంఘ ప్రతినిధులు గౌడ కృష్ణారి, శ్రీరామ్ మనోహర్, దొంత బాల్రాజు, ఎనగందుల శంకరు, దశరథము, తడుక ప్రభాకర్, గౌడ సహదేవ్, తాటిపాముల లక్ష్మీనారాయణ, సంఘ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




