ముస్తాబాద్, ఆగస్టు 18 (24/7న్యూస్ ప్రతినిధి): పట్టణ అధ్యక్షుడు తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలవేసి 374 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కడే కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ నాటి రాజులపై తిరుగుబాటు చేసి బ
హుజనులకు అండగా నిలబడి పోరాట పటిమతో గెలిచినట్లు పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకోసం పనిచేస్తూ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొండ యాదగిరి గౌడ్, యాదగిరి, దేవేందర్, రాజారాం, బాలయ్య, ఎల్లయ్య, లక్ష్మయ్య, శ్రీనివాస్, శేఖర్, దేవదాస్, సంతోష్, ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ సంఘం సభ్యులు ఉన్నారు.




