సెస్ డైరెక్టర్ కృష్ణహారి కి వినతిపత్రం సమర్పించిన వికలాంగుడు
ఎల్లారెడ్డిపేట జనవరి 24 :ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వికలాంగుడు మెడిశెట్టి రాజశేఖర్ తనకు మూడు చక్రాల వాహనము ( స్క్రూటి ) ఇప్పించాలని సెస్ డైరెక్టర్ కృష్ణ హారి కి మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు,ఈ సందర్భంగా కృష్ణహారి మాట్లాడుతూ వికలాంగుడైన అర్హత కలిగిన మేడిశెట్టి రాజశేఖర్ కు మూడు చక్రాల వాహనం స్క్రూటీ ని తప్పకుండా ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి బండారి బాల్ రెడ్డి, మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కంచర్ల రాజు, బిసి సంక్షేమ సంఘం ప్రతినిధులు రమేష్ , మహేందర్, రాజేందర్ , రాజు , తదితరులు పాల్గొన్నారు, వికలాంగుడు రాజశేఖర్ కు మూడు చక్రాల వాహనము స్క్రూటి ఇప్పిస్తామని హామీ ఇచ్చినందుకు వరుస కృష్ణ హరి కి వారు కృతజ్ఞతలు తెలిపారు





